BIG ALERT:సింగరేణిలో 327 జాబ్స్..దరఖాస్తు తేదీల్లో మార్పులు

సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

Update: 2024-04-28 12:44 GMT

దిశ,వెబ్‌డెస్క్: సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొదట ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించగా, పలు కారణాల వల్ల దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసినట్లు అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు. మే 15న మ.12 నుంచి జూన్ 4న సా.5 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.

సింగరేణి సంస్థ 327 మేనేజ్‌మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మే 4వ నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియను వాయిదా వేశారు. మే 15 నుంచి జూన్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాల కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ని సందర్శించండి.

Similar News