అక్షయ తృతీయ వేళ ఫోన్‌పే బంపర్ ఆఫర్..రూ.2 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందండి ఇలా!

అక్షయ తృతీయ అనగానే మహిళలందరూ ఏ బంగారం షాప్‌లోకి వెళ్లాలి. ఎక్కడ బంగారం తక్కువగా ఉంది అని వెతుకుతుంటారు. బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ మంచి రోజు అని చాలా మంది భావిస్తారు.

Update: 2024-05-08 05:41 GMT

దిశ, ఫీచర్స్ : అక్షయ తృతీయ అనగానే మహిళలందరూ ఏ బంగారం షాప్‌లోకి వెళ్లాలి. ఎక్కడ బంగారం తక్కువగా ఉంది అని వెతుకుతుంటారు. బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ మంచి రోజు అని చాలా మంది భావిస్తారు. అందుకే ఆరోజు తప్పని సరిగా గోల్డ్ కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా చాలా కంపెనీలు ఈరోజు మంచి మంచి ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఫోన్ పే బంగారం కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ సందర్భంగా ఫిన్ టెక్ ప్లాట్ ఫారం ఫోన్ పే స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ ప్రకటించింది. మే 10న ఫోన్‌పే వినియోగదారులు 24k డిజిటల్ గోల్డ్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే రూ.2,000 వరకు అష్యూర్డ్‌ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చునని తెలిపింది. అయితే కనీసం రూ.1000 కొనుగోళ్లకు మాత్రమే ఆఫర్‌ వర్తిస్తుందని ఫోన్ పే తెలిపింది. యూపీఐ, యూపీఐ లైట్, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్‌, వ్యాలెట్‌లు, గిఫ్ట్ కార్డ్‌ సహా చేసిన పేమెంట్‌లపై క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. కాగా, డిజల్ లో ఎలా గోల్డ్ కొనుగోలు చేసి, క్యాష్ బ్యాక్ పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి, రీఛార్జ్ అండ్ పే బిల్స్ లో సీ ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలి. తర్వాత అక్కడ మీకు మెనూ కనిపిస్తూ ఉంటుంది. దీంతో అందులో గోల్డ్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోని, బయ్ వన్ టైమ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత ‘బయన్‌ ఇన్‌ రూపీస్‌’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకుని, 24కే బంగారాన్ని కొనుగోలు చేయడానికి కనీసం రూ.1000 పే చేయాలి. దీంతో మీరు కొనుగోలు చేసిన గోల్డ్ బ్యాలెన్స్ ఫోన్‌పే యాప్‌లో కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఫోన్ పే గిఫ్ట్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్యాష్ బ్యాక్ పొందండి.

Tags:    

Similar News