పతంజలికి కొనసాగుతున్న కష్టాలు.. షోకాజ్ నోటీసు జారీ చేసిన GST విభాగం
పతంజలికి ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన సంస్థకు మరో షాక్ తగిలింది.
బిజినెస్ బ్యూరో: పతంజలికి ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన సంస్థకు మరో షాక్ తగిలింది. రూ. 27.5 కోట్ల పన్ను క్లెయిమ్కు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (చండీగఢ్) నుండి కంపెనీ శుక్రవారం నోటీసును అందుకోగా. తాజాగా ఈ నోటీసు ప్రాతిపదికన ట్యాక్స్ క్రెడిట్ను (వడ్డీతో సహా) ఎందుకు రికవరీ చేయకూడదో వివరించాలని పేర్కొంటూ పతంజలికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 74, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్, 2017, ఉత్తరాఖండ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్, 2017లోని ఇతర వర్తించే నిబంధనల కింద పెనాల్టీ ఎందుకు విధించకూడదని GST విభాగం నోటీసుల్లో పేర్కొంది.
దీనిపై స్పందించిన సంస్థ GST అథారిటీ షోకాజ్ నోటీసును మాత్రమే జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. 1986లో స్థాపించబడిన, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, గతంలో రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్గా పిలువబడేది. పతంజలి ఆయుర్వేద్ దివాలా ప్రక్రియ ద్వారా రుచి సోయాను కొనుగోలు చేసి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్గా మార్చింది.