ఏప్రిల్ నుంచి ఎక్స్‌రే యంత్రాలు, ఇతర పరికరాలపై కస్టమ్స్ సుంకం పెంపు!

ఎక్స్‌రే యంత్రాలు, నాన్-పోర్టబుల్ ఎక్స్‌రే జనరేటర్ల దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఏప్రిల్ 1 నుంచి వీటి దిగుమతులపై సుంకం 10 శాతం నుంచి 15 శాతానికి పెరుగుతుంది.

Update: 2023-03-26 13:43 GMT

న్యూఢిల్లీ: ఎక్స్‌రే యంత్రాలు, నాన్-పోర్టబుల్ ఎక్స్‌రే జనరేటర్ల దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. ఏప్రిల్ 1 నుంచి వీటి దిగుమతులపై సుంకం 10 శాతం నుంచి 15 శాతానికి పెరుగుతుంది. గతవారం లోక్‌సభలో ఆమోదించిన ఆర్థిక బిల్లు-2023 సవరణలో భాగంగా పోర్టబుల్ ఎక్స్-రే యంత్రాలు, నాన్-పోర్టబుల్ ఎక్స్-రే జనరేటర్లు, పరికరాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్‌లో తయారీకి ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. కస్టమ్స్ సుంకం పెంపుతో ఆయా పరికరాల దిగుమతులు తగ్గి మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత చేరువ అయ్యేందుకు వీలవుతుందని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్‌నర్ రజత్ మోహన్ వెల్లడించారు.

Tags:    

Similar News