దీపావళి పండగకు శుభవార్త తీసుకొచ్చిన EPFO
దీపావళి పండగను పురస్కరించుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఉద్యోగులకు..Latest Telugu News
దిశ, వెబ్డెస్క్: దీపావళి పండగను పురస్కరించుకుని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. పీఎల్బీ కింద 60 రోజులకు సమానమైన వేతనాన్ని ఉద్యోగులకు బోనస్గా ఇవ్వనుంది. దీని ద్వారా ఒక్కొక్క ఉద్యోగికి గరిష్టంగా రూ.13,806 బోనస్ అందుతుంది. ఈపీఎఫ్ఓలో పనిచేసే గ్రూప్ సీ, గ్రూప్ బీ(నాన్-గెజిటెడ్) ఉద్యోగులందరికీ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ను(PLB)ను అందిస్తున్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది.