వినియోగదారుకు క్రిస్మస్, న్యూయర్ గిఫ్ట్.. తగ్గిన సిలిండర్ ధరలు

క్రిస్మస్, న్యూయర్ ముందు వ్యాపార వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. కమర్షియల్ (వాణిజ్య) ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి.

Update: 2023-12-22 08:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: క్రిస్మస్, న్యూయర్ ముందు వ్యాపార వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్పాయి. కమర్షియల్ (వాణిజ్య) ఎల్పీజీ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ. 39.50 ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. వాణిజ్య సిలిండర్ల కొత్త ధరలు నేటి నుంచి అంటే డిసెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. కాగా, ముంబైలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1,710కి ఉండగా. చెన్నైలో ధర రూ.1,929గా ఉంది. అదేవిధంగా ఢిల్లీలో రూ.1,757గా ఉంది.

Tags:    

Similar News