రూ.14 పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.14 పెరిగింది.

Update: 2024-02-01 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ వైపు పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.14 మేర పెరిగింది. అయితే ఈ పెంపు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఫిబ్రవరి 1 నుంచే ఈ మారిన ధర అమల్లోకి వచ్చింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,769.50కు చేరింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్లను వినియోగించే వ్యాపార వర్గాలపై ధర పెరుగుదల ఎఫెక్టు పడనుంది. 

Tags:    

Similar News