నాటు బాంబు పేలి కుక్కలు మృతి

దిశ, అమరావతి బ్యూరో: తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఇద్దరు గాయపడ్డారు. మూడు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం శికారిపాలెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్ అనే ఇద్దరూ తప్పిపోయిన తమ గొర్రె జీవాలను వెతుకుతున్న సమయంలో అడవి జంతువుల వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలాయి. దీంతో నాయుడు, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని […]

Update: 2020-07-03 00:33 GMT

దిశ, అమరావతి బ్యూరో: తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఇద్దరు గాయపడ్డారు. మూడు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం శికారిపాలెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్ అనే ఇద్దరూ తప్పిపోయిన తమ గొర్రె జీవాలను వెతుకుతున్న సమయంలో అడవి జంతువుల వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలాయి. దీంతో నాయుడు, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News