విశాఖలో బీజేపీ శిక్షణా తరగతులు

దిశ, విశాఖపట్నం: బీజేపీలో ప్రతీ కార్యకర్త నిబద్ధతతో కూడిన పరివర్తన కలిగి ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం విశాఖ జిల్లా గాజువాకలో బీజేపీ రెండ్రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఏళ్ల నుండి పరిష్కరం కానీ సమస్యలను ప్రధాని మోడీ సున్నితంగా పరిష్కరించి ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌ స్థాయి నుంచి ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. […]

Update: 2020-11-02 09:48 GMT

దిశ, విశాఖపట్నం: బీజేపీలో ప్రతీ కార్యకర్త నిబద్ధతతో కూడిన పరివర్తన కలిగి ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సోమవారం విశాఖ జిల్లా గాజువాకలో బీజేపీ రెండ్రోజుల శిక్షణ తరగతులు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఏళ్ల నుండి పరిష్కరం కానీ సమస్యలను ప్రధాని మోడీ సున్నితంగా పరిష్కరించి ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి బూత్‌ స్థాయి నుంచి ప్రజలకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. ఏపీ ఇన్‌చార్జ్ సునీల్ థియోధర్‌ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనుందని, దీనికి తగిన విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు.

Tags:    

Similar News