కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. దేశంలోని రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టమని విమర్శించడం అర్థరహితమని ఆయన అన్నారు. లేని పోని అనుమానాలను కల్పిస్తూ తెలంగాణ రైతులను అయోమయానికి గురి చేయడం భావ్యం కాదని అని ఆయన అన్నారు. కాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె […]
దిశ,వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్కు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. దేశంలోని రైతుల సంక్షేమానికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టమని విమర్శించడం అర్థరహితమని ఆయన అన్నారు. లేని పోని అనుమానాలను కల్పిస్తూ తెలంగాణ రైతులను అయోమయానికి గురి చేయడం భావ్యం కాదని అని ఆయన అన్నారు.
కాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిదని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు అన్యాయం చేసే ఈ బిల్లులను వ్యతిరేకించాలని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.