సుశాంత్ తండ్రి కోరితే అదే చేస్తాం : నితీశ్ కుమార్

దిశ, వెబ్ డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సుశాంత్ తండ్రి సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరితే అందుకు తాము సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. గత 45 రోజులుగా కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇంతవరకు మిస్టరీని ఛేదించలేకపోయారని వివరించచారు. ప్రస్తుతం బీహార్ […]

Update: 2020-08-01 08:53 GMT

దిశ, వెబ్ డెస్క్: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. సుశాంత్ తండ్రి సీబీఐ విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరితే అందుకు తాము సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరోవైపు నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. గత 45 రోజులుగా కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఇంతవరకు మిస్టరీని ఛేదించలేకపోయారని వివరించచారు. ప్రస్తుతం బీహార్ పోలీసులు నిజాయతీగా విచారణ చేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని సుశాంత్ సోదరి కోరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News