Breaking News: నాయకులా.. ? రౌడీలా..? జనసేన నేతలపై వైసీపీ నాయకుల దాడి..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.

Update: 2024-03-22 06:41 GMT

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.రోజురోజుకు అధికారపార్టీ తీరు విపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తోంది. భద్యతగల స్థానంలో ఉన్నామని మరిచిపోయి రౌడీల్లా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. తాజగా పల్నాడు జిల్లాలోని మించలపాడులో జనసేన నేతలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు.

జనసేన నేతలు కార్ లో ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటి చేసుకుంది. నిన్న రాత్రి జనసేన నేతలు తమ వ్యక్తిగత పనులను ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వాహనాన్ని గుర్తించిన వైసీపీ నాయకులు వాహనం పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఇక అలానే పల్నాడు జిల్లాలోని మాచర్ల 8వ వార్డుకు చెందిన బండారు రామయ్య బొలెరో వాహాన్ని తగలబెట్టారు గుర్తుతెలియని వ్యక్తులు.

ఒకే రోజు రెండు దురాగతాలు చోటు చేసుకోవడంతో జనసేన నేతలు వైసీపీ నాయకులే తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read More..

AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. ప్రముఖ నేత గుడ్ బై  

Tags:    

Similar News