Palakollu: టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలంటూ నిమ్మల వినూత్న నిరసన

టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలనిపాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విన్నూత్న నిరసనకు దిగారు..

Update: 2023-11-11 13:50 GMT

దిశ, (ఉభయ గోదావరి ప్రతినిధి): టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విన్నూత్న నిరసనకు దిగారు. పాలకొట్లు టిడ్కో గృహ సముదాయం వద్ద ఉంటూ లబ్ధిదారుల సమస్యలపై గళమెత్తారు.  నిద్ర, స్నానం వంటివి చేస్తూ నిరనన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ  టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను 90 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పది శాతం పనులు కూడా చేయలేకపోయారని విమర్శించారు.


లబ్దిదారులు అద్దెలు నిమిత్తం వేలాది రూపాయిలు చెల్లించి అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు బిక్షాటన చేసుకొనే పరిస్థితికి  సీఎం జగన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ఉచితంగా ఇస్తామని చెప్పి లబ్ధిదారులను మోసం చేశారని నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News