Eluru: కరోనాతో వృద్ధుడు మృతి

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లిలో వృద్ధుడు కోవిడ్ బారినపడి మృతి చెందాడు...

Update: 2023-04-08 17:29 GMT

దిశ ,కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లిలో వృద్ధుడు కోవిడ్ బారినపడి మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో వృద్ధుడిని కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వృద్ధుడికి వైద్య పరీక్షలు  నిర్వహించాగా కోవిడ్ లక్షణాలు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా పరిస్థితి విషమించడంతో వృద్ధుడు మృతి చెందారు.  దీంతో మృతుడి కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ వచ్చినా ప్రస్తుతం హోమ్ ఐషోలేషన్‌లో ఉండాలని సూచించారు. చాలాకాలం తర్వాత కుక్కునూరు మండలంలో కోవిడ్ మహమ్మారికి ఒకరు బలికావడంతో మళ్ళీ ప్రజల్లో భయాందోళన నెలకొంది.

Tags:    

Similar News