వైసీపీ పాలనకు నాలుగేళ్లు పూర్తి.. కేక్ కట్ చేసిన వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ పాలనకు నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి కేక్ కట్ చేశారు.

Update: 2023-05-23 11:06 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి 4 సంవత్సరాల అయిన సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కేక్ కట్ చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే లు ముత్తంశెట్టి శ్రీనివాస్, నాగిరెడ్డి, సమన్వయ కర్త కేకే రాజు, వాసుపల్లి గణేష్ కుమార్, మేయర్ హరి వెంకట కుమారి, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News