Visakha: వైసీపీ నుంచి ఇద్దరు నేతల సస్పెండ్

ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ సిటీకి చెందిన ఇద్దరి నేతలపై సస్పెన్షన్ వేటు పడింది..

Update: 2023-05-13 10:47 GMT

దిశ, ఉత్తరాంధ్ర: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలోని 60వ వార్డు కార్పొరేటర్ పి.వి.సురేష్‌ను, 89వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Karnataka Election Results: కర్ణాటక కోసం పార్థించాం... బీజేపీని ఓడించాం: కేఏపాల్  

Tags:    

Similar News