అభివృద్ధి కానరాదేమి?: అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడిచిన నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్లు నిధులను కేంద్రం సమకూర్చితే ఇక్కడ అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదని అమిత్ షా మండిపడ్డారు...

Update: 2023-06-11 15:34 GMT

దిశ ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడిచిన నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్లు నిధులను కేంద్రం సమకూర్చితే ఇక్కడ అభివృద్ధి ఎక్కడా కానరావడం లేదని అమిత్ షా మండిపడ్డారు. విశాఖ సభలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి 4ఏ ళ్లలో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వమని పైకి చెబుతున్నా వాస్తవ రూపంలో ఇక్కడ రైతుల ఆత్మహత్యల విషయంలో దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు. రైతుల ఆత్మహత్యలపై జగన్మోహన్ రెడ్డి సిగ్గు పడాలని అన్నారు. పేదలకి నరేద్రమోడీ ఉచిత బియ్యం ఇస్తే దానిపై జగన్ మోహనరెడ్డి ఫొటో అవసరమా అని ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం రెండు వందేభారత్ ఎక్సప్రెస్ ట్రైన్‌లను ఇచ్చిందని అమిత్ షా గుర్తు చేశారు. 

ఇవి కూడా చదవండి:

జగన్ ఆ విషయంలో సిగ్గు పడాలి: YCP సర్కార్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్  

Tags:    

Similar News