Visakha: మరోసారి మత్తు ఇంజక్షన్ల కలకలం

విశాఖలో మరోసారి మత్తు ఇంజక్షన్లు కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి..

Update: 2023-05-18 10:10 GMT

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో మరోసారి మత్తు ఇంజక్షన్లు కలకలం రేపాయి. వారం రోజులు గడవక ముందే అదే ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లు పట్టుబడ్డాయి. పెందుర్తి పరిధిలో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారులు గుర్తించారు. ఐదు రోజుల క్రితం అల్లిపురంలో 2,500 మత్తు ఇంజక్షన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


గంజాయి, మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ సీపీ త్రివిక్రమ వర్మ హెచ్చరించారు. 

Tags:    

Similar News