AP Elections 2024:ఆ నియోజకవర్గంలోని ప్ర‌జ‌లు చాలా క్లారిటీగా ఉన్నారు..ఆ పార్టీదే అధికారం?

నియోజకవర్గ ప్ర‌జ‌లంద‌రూ చాలా క్లారిటీగా ఉన్నార‌ని ఏ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసిందో కూడా వారికి తెలుస‌ని గంగాధరనెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ చెప్పారు.

Update: 2024-03-28 12:42 GMT

దిశ,గంగాధరనెల్లూరు:నియోజకవర్గ ప్ర‌జ‌లంద‌రూ చాలా క్లారిటీగా ఉన్నార‌ని ఏ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసిందో కూడా వారికి తెలుస‌ని గంగాధరనెల్లూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ చెప్పారు. బాబు షూరిటీ - భ‌విష్య‌త్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయ‌న పాలసముద్రం మండలం ఆముదాల పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.ఈ సంద‌ర్భంగా డాక్టర్ థామస్ మాట్లాడుతూ రానున్న ఎన్నిక‌ల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా,ఎంపీగా ప్రసాద్ రావుల‌కు అండ‌గా నిల‌వాల‌ని అభ్య‌ర్థించారు. రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు భీమినేని చిట్టి బాబు నాయుడు, ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Similar News