చంద్రబాబు కాన్వాయ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. చుట్టుముట్టిన బాపిరాజు వర్గీయులు

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసమ్మతి సెగ తలిగింది. ...

Update: 2024-04-05 12:03 GMT

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసమ్మతి సెగ తలిగింది. ఈ నియోజకవర్గం సీటు ఆశించిన ముళ్లపూడి బాపిరాజును ఆశాభంగం కలిగింది. మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ ఇచ్చారు. దీంతో బాపిరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లజర్లలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారు. కాన్వాయ్‌ను చుట్టిముట్టి బాపిరాజుకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. రోడ్డు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులతో బాపిరాజు వర్గీయులు వాగ్వాదానికి దిగారు. తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో ముళ్లపూడి వర్గీయులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి చేయడం తగదన్నారు. ఇప్పుడు సీటు దక్కని వారందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పారు. 

Tags:    

Similar News