నగరిలో ఫస్ట్ ఓడిపోయేది రోజానే.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి, నగరి వైసీపీ అభ్యర్థి రోజాపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-05-02 09:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మంత్రి, నగరి వైసీపీ అభ్యర్థి రోజాపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానెల్ డిబెట్‌లో ఆయన మాట్లాడారు. మీ ఊరిలో రోడ్డు వేయించారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు సాంక్షన్ చేస్తామని తుడా చైర్మన్ చెప్పారన్నారు. అనుకోకుండా సజ్జల, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎయిర్ పోర్టులో కలిశామని.. రోడ్డు విషయమై రోజాను అడిగితే తనకేం సంబధం లేదని చెప్పిందని నారాయణ అన్నారు. నిధుల మంజూరు విషయంలో వద్దని రోజా చెప్పినట్లు తెలిసిందన్నారు. అయితే తాను పోస్ట్ చేసిన ఓ వీడియో చూసి అధికారులు పరువు పోతుందని రోడ్డు వేశారన్నారు. నగరిలో ఫస్ట్ ఓడిపోయేది రోజానే అన్నారు. రోజా తమపై కక్ష సాధింపు చర్యలు చేసిందన్నారు. 

Similar News