ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఖరారు.. అధికారిక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభ ఖరారు అయింది.

Update: 2024-03-14 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభ ఖరారు అయింది. ఈ నెల 16వ తేదీన స్టీల్ ప్లాంట్‌లో బహిరంగ సభ జరుగనుందని ఏపీ మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ప్రకటించారు. గురువారం రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కేంద్రం కుట్రను అడ్డుకునేందుకు ఎంత వరకైనా పోరాటం చేస్తామని ప్రకటించారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని అన్నారు. చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందా రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌లోకి వస్తామంటే స్వాగతం పలుకుతామని ఆహ్వానించారు.

Read More..

గంటా శ్రీనివాస్‌ దారెటు? హైకమాండ్ ఆదేశాలు వినకపోతే?  

Tags:    

Similar News