Prakasam District: రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే ఫోకస్

ప్రకాశం జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. మార్కాపురం, తర్లుపాడు రైల్వే స్టేషన్లను ఆయన పరిశీలించారు....

Update: 2022-11-22 11:52 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పర్యటించారు. మార్కాపురం, తర్లుపాడు రైల్వే స్టేషన్లను ఆయన పరిశీలించారు. మార్కాపురం స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. అక్కడి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలపై ప్రయాణికులను అడిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు -గుంతకల్లు డబ్లింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లను త్వరగా అభివృద్ధి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు వేస్తున్నట్లు అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

Similar News