Big Breaking: లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. ఏం నిర్ధారించారంటే?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Update: 2024-03-20 06:21 GMT

దిశ.మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనితో యజకీయ నేతలకు ఎన్నికల సెగ తాకుతోంది.

తాజాగా ఇవాళ ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ రోజు ఉదయం లోకేష్ తన కాన్వాయ్ లో కరకట్ట పై వెళ్తుండ గా ఈ ఘటన చోటు చేసుకుంది. లోకేష్ కాన్వాయ్ తో సహా తన వెంట వచ్చిన అన్ని కార్లను పోలీసులు ఆపారు.

అనంతరం అన్నింటినీ తనిఖీ చేశారు. కాగా పోలీసులు తనికీలు చేసేందుకు నారా లోకేష్ సహకరించారు. తనిఖీల అనంతరం కాన్వాయ్‍ లో ఎన్నికల కోడ్‍కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. 

Read More..

యాదవులకు సీటు ఇస్తారా..? హ్యాండ్ ఇస్తారా..? టీడీపీ యోచన ఏంటి  

Tags:    

Similar News