అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.70 లక్షల నగలు స్వాధీనం
కర్నూలు జిల్లా నంద్యాలలో అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 70 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, రెండు కార్లు, ఆయుధం స్వాధీనం చేసుకున్నారు. అపార్ట్మెంట్లే టార్గెట్గా అవుల కిరణ్ దంపతులు చోరీలకు పాల్పడ్డారు. నిందితుడు కిరణ్పై తెలుగు రాష్ట్రాల్లో 110కి పైగా కేసులు ఉన్నాయి. ఏపీలో ఆరు కేసులకు సంబంధించి ప్రాపర్టీని పోలీసులు రికవరీ చేశారు.