Pawan: వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-26 17:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కోససీమ జిల్లా మకలిపురం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన తరఫున గెలిచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద రావు 5 ఎకరాల్లో ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. రైతుల కష్టాలను నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోదని మండిపడ్డారు. డ్రైవర్‌ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్‌ డెలివరీ చేశారని ఆ విషయాన్ని జనం అంత సులువుగా మరిచిపోరని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదేక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘ఆంధ్రా ప్రజరారా ఊపిరి తీసుకోండి.. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని’ అని పవన్ అన్నారు. 

Tags:    

Similar News