మరీ ఇంత మంచితనం పనికిరాదు సార్.. 24 సీట్ల కోసం అవసరమా?

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.

Update: 2024-02-24 08:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం 118 స్థానాలను ప్రకటించగా.. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా జనసేనకు సరైన సీట్లు రాలేదని పవన్ అభిమానులు, తదితరులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 24 అసెంబ్లీ స్థానాల కోసం అంత అవసరమా అని మరి కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఫస్ట్ లిస్ట్‌లో 24 సీట్లు దక్కడంపై పవన్ కల్యాణ్ అభిమానిగా అవమానం జరిగిందని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు జనసేనకు ఓడిపోయే సీట్లు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితి టీడీపీ మద్దతు లేకుండా 20 సీట్లు గెలుస్తామని, టీడీపీకి ఎందుకు మద్దతిస్తున్నామని పవన్‌ను ప్రశ్నించారు. మరి ఇంత మంచితనం పనికిరాదని అనిపిస్తుంది ఒక్కోసారి.. అంటూ అభిమాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కాగా, సీట్ల వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎక్కువ స్థానాలు తీసుకుని ప్రయోగాలు చేయడం కంటే.. తక్కువ స్థానాలే మేలు అని అన్నారు.

Read More..

వైసీపీ నుండి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలకు బిగ్ షాకిచ్చిన చంద్రబాబు..!  

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News