తమిళనాడు ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్.. తమిళంలో స్పీచ్ అదుర్స్..

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో మొదటి విడతలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-04-12 14:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో మొదటి విడతలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ అన్నమలై సారథ్యంలో మంచి ఫామ్ లో కనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాగైన ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా అన్నమలై ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా కోయంబత్తూర్ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం తెలుగు వారు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో టీడీపీ నేత నారా లోకేష్ తో ప్రచారం చేయించారు.

ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ నుంచి లోకేష్ అన్నమలై తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ తమిళంలో స్పీచ్ మొదలు పెట్టి.. మాజీ ఐపీఎస్ అయిన అన్నమలై ను తంబీ అని పిలిచాడు. అలాగే తమిళంలో అనర్గళంగా మాట్లాడాడు. అనంతరం తెలుగు వారు కోయంబత్తూర్ నియోజకవర్గంలో 20 శాతం వరకు స్థిరపడి ఉన్నారని వారంతా యువ నాయకుడైన అన్నమలై కి ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరారు.

Tags:    

Similar News