Hindupuram: మిట్ట మధ్యాహ్నం నామినేషన్ వేసిన బాలయ్య

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు...

Update: 2024-04-19 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తొలుత తన నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి హిందూపురం పట్టణంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ పత్రాలకు సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం హిందూపురంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కరెక్ట్‌గా 12.10కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి వసుంధర సైతం హాజరయ్యారు. 

కాగా హిందూపురంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బాలయ్య సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2014,2019 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా హిందూపురంలో పలు సేవలు అందించారు. ఇప్పుడు మరోమారు కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. హిందూపురంలో బాలయ్యను ఓడించేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ వేసింది. బాలయ్యపై మహిళను పోటీ పెట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. మరి బాలయ్యకు హిందూపురం ప్రజలు మరోసారి పట్టం కదతారేమో చూడాలి.

Tags:    

Similar News