Breaking: పొత్తులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి.

Update: 2024-02-08 12:14 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఒక్కటై రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సంసిద్దమైంది. అయితే టీడీపీ, జనసేన బీజేపీ తో కూడ పొత్తుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో, టీడీపీ, జనసేన అధినేతలు చర్చలు జరుపుతున్నారు. కాగా ఆ పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఉంటుందని.. ఉండాలని కూడా తాను కోరుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రాక్షస పాలనను అంతమొందించాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలని.. అలా ఏకమైతే తప్పేం కాదు అని నాగబాబు పర్కొన్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.    

Tags:    

Similar News