ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ తరలింపు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ ‌రెడ్డి తల్లి కోలుకున్నారు. ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్సపొందుతున్నారు.

Update: 2023-05-26 08:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కడప ఎంపీ వైఎస్ అవినాశ్ ‌రెడ్డి తల్లి కోలుకున్నారు. ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్సపొందుతున్నారు. అయితే శుక్రవారం ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శ్రీలక్ష్మిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఇకపోతే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరుతూ ఎంపీ అవి నాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఈనెల 19న, 22న సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. 27 వరకు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

Similar News