కెనడాలో ఏపీ విద్యార్థి మిస్సింగ్ మిస్టరీ
కెనడాలో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థి నిడమనూరి శ్రీధర్ అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో : కెనడాలో విద్యనభ్యసిస్తున్న ఏపీ విద్యార్థి నిడమనూరి శ్రీధర్ అదృశ్యమైన ఘటన మిస్టరీగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనకు చెందిన శ్రీధర్ ఏప్రిల్ 21న కెనడాలో కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి నేటి వరకు శ్రీధర్ జాడ తెలియలేదు. దీంతో తమ కుమారుడు ఏమయ్యాడో తెలియక అతడి తల్లిదండ్రులు సీతారామయ్య, వెంకటరమణ ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడు మిస్సింగ్ మిస్టరీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి తమకు సాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. శ్రీధర్ మిస్సింగ్ ఘటన నేపథ్యంలో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు.