బీజేపీతో టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యే.. క్లారిటీ ఇచ్చిన మల్లాది

విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు బీజేపీలో చేరతారే ప్రచారం జరుగుతోంది...

Update: 2024-03-15 11:37 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం ఇంచార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సీఎం జగన్ నియమించినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయన శుక్రవారం స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు. బీజేపీతో టచ్‌లో ఉన్నాననేది అవాస్తవమని మల్లాది విష్ణు కొట్టిపారేశారు. ఐదేళ్లుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు చేస్తున్నానని, ఈసారి ఎన్నికల్లో సీటు కేటాయించకపోయినా తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. వైసీపీలోనే కొనసాగుతానని, సీఎం జగన్ వెంటే నడుస్తానని మల్లాది విష్ణు పేర్కొన్నారు. దుష్ప్రచారాలను వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు నమ్మొద్దని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని మల్లాది విష్ణు తెలిపారు. 

Tags:    

Similar News