ఘరానా మోసం.. రూ. 20 కోట్లు నొక్కి మకాం మార్చిన వ్యాపారి

విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది....

Update: 2024-05-22 13:32 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్ ఫహీద్ అనే వ్యక్తి 2020 నుంచి విజయవాడ వించిపేటలో స్క్రాప్ వ్యాపారం నిర్వహించారు. తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని.. లాభాల్లో వాటాలు ఇస్తానని స్థానిక ప్రజలను నమ్మించారు. ఫహీద్ మాటలు నమ్మి దాదాపు రూ. 20 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు. అయితే వ్యాపారి ఫహీద్ రాత్రికి రాత్రే విజయవాడ నుంచి గుంటూరు నులకపేటకు మకాం మార్చారు. దీంతో అబ్దుల్ ఫహీద్‌కు బాధితులు ఫోన్ చేశారు. ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో ఫహీద్ మోసం చేశారని గుర్తించారు. వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. వ్యాపారి అబ్దుల్‌ నుంచి తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరారు.

Similar News