సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు..జూలకంటి బ్రహ్మారెడ్డి

టీడీపీ,జనసేన,బీజేపీ రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని మాచర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు.

Update: 2024-03-28 15:20 GMT

దిశ,మాచర్ల:టీడీపీ,జనసేన,బీజేపీ రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతాయని మాచర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గురువారం కారంపూడి మండల పరిధిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాచవరం బట్టు వారి పల్లె,గాదె వారి పల్లె గ్రామాల్లో బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని సమస్యల పై ప్రశ్నించిన వారి పై తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు దాడులు సైతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో రాక్షసుడు రాజ్యం నుంచి విముక్తి కావాలంటే కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

పల్నాటి రాహు కేతువులను తరిమికొట్టేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పల్నాడు ప్రాంతాన్ని ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమల ద్వారా ముందుకు తీసుకెళ్లేందుకు యువత చేతులు కలపాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాచర్ల జనసేన సమన్వయకర్త బుస రామాంజనేయులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కర్నా అమర సైదారావు,కొంగర లక్ష్మీనారాయణ,,లింగాల శ్రీనివాస్,పంగులూరి పుల్లయ్య, అంజయ్య, జనసేన మండల అధ్యక్షుడు మల్లయ్య బీజేపీ నాయకులు హనుమంతరావు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News