ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ..

ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ అభ్యర్థులకు ఫోన్ కాల్స్, నకిలీ మెయిల్స్ ను సైబర్ నేరగాళ్లు పంపుతున్నట్లు ఎయిమ్స్ అధికారులు సోమవారం గుర్తించారు.

Update: 2022-12-06 11:34 GMT

దిశ, మంగళగిరి: ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ అభ్యర్థులకు ఫోన్ కాల్స్, నకిలీ మెయిల్స్ ను సైబర్ నేరగాళ్లు పంపుతున్నట్లు ఎయిమ్స్ అధికారులు సోమవారం గుర్తించారు. మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ పేరుతో ఓ ఫేక్ మెయిల్ ఐడీ క్రియేట్ చేసి సైబర్ నేరగాళ్లు మెయిల్స్ పంపుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎయిమ్స్ అధికారులు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించారు.

Similar News