Alla Ramakrishna Reddy : ఆదిలోనే వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన ఆర్కే

ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేస్తుంది.

Update: 2024-02-20 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుని ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూ తనదైన శైలిలో తన సొంత అన్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది.

అయితే రెండు రోజుల క్రితం ఆర్కే.. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిశారు. ఆయనతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్కే నేడు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. దీంతో ఆయన తిరిగి వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కాంగ్రెస్ పార్టీలో ఆదిలోనే గట్టి షాక్ తగిలినట్లైతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే వైసీపీ నుంచి వరుసగా కీలక నేతలు పార్టీలు మారుతుండగా.. ఆర్కే తిరిగి చేరడంతో ఇతర పార్టీలోకి వలసలు తగ్గుతాయని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు.

Read More..

14 ఏళ్ల సీఎంకు ఆ సమస్య కనిపించలేదా..? చంద్రబాబుపై మంత్రి ధర్మాన సెటైర్లు 

Tags:    

Similar News