దయచేసి మాతో కలిసిరండి.. వారికి చంద్రబాబు కీలక పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని, వైసీపీ సర్కార్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2022-11-26 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని, వైసీపీ సర్కార్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ సర్కార్‌ రాజ్యాంగ విలువలు పాటించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నియంతృత్వ పోకడలకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. నిరసనలు తెలిపితే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పోరాటానికి ప్రజలు టీడీపీతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.

READ MORE

'అక్రమ భూముల చట్టబద్ధత కోసమే భూరక్ష' 

Tags:    

Similar News