Varahi Yatra: పోలవరంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

పోలవరం పూర్తి కావాలంటే జనసేన రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

Update: 2023-06-14 16:49 GMT

దిశ, వెబ్ డెస్క్: పోలవరం పూర్తి కావాలంటే జనసేన రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడితో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అన్ని దారులూ సీఎం జగన్ ఇంటి వైపు చూపిస్తున్నాయన్నారు. బాబాయ్ రక్తం అంటుకున్న వ్యక్తి మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలా అని ప్రశ్నించారు. జనసేన సయోధ్య చూపుతుంటే వైసీపీ మాత్రం కులాల మధ్య కుంపట్లు పెడుతోందని మండిపడ్డారు. బీసీ కార్పొరేషన్లు, సబ్ ప్లాన్ పెట్టినా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో ఒంటరిగా వస్తానో.. పొత్తులో వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదని పవన్ కల్యాణ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan :పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన ప్రొడ్యూసర్.. మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్న పీకే  

TDP: విశాఖపై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి బాలకృష్ణ అల్లుడు  

ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)  

Tags:    

Similar News