లోకేశ్‌కి చికిత్స అందించిన వైద్యులు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భుజాల నొప్పితో బాధపడుతున్నారు.

Update: 2023-03-18 10:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భుజాల నొప్పితో బాధపడుతున్నారు.యువగళం పాదయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న లోకేష్ నిత్యం పార్టీ నేతలు, అభిమానులతో కలుస్తూనే ఉన్నారు. అయితే శుక్రవారం లోకేశ్‌ను కలిసేందుకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ శ్రేణులను నిలువరించడంలో పోలీసులు విఫలమవ్వడంతో అక్కడ తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో లోకేష్ భుజాలకు గాయమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం లోకేశ్‌ భుజం నొప్పితో బాధపడటంతో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం లోకేష్ పాదయాత్ర నిర్వహించారు. విడిది శిబిరం వద్దకు వచ్చిన అభిమానులుకు, కార్యకర్తలకు సెల్పీలు ఇచ్చారు.

Similar News