నా ఆయుధం ఇదే.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉండడంతో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Update: 2024-04-23 12:02 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉండడంతో అన్ని పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం లో జరుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమికి ఎన్ని మీడియాలు మద్ధతుగా ఉన్నా..వైసీపీకి మాత్రం సోషల్ మీడియా సపోర్ట్‌గా ఉందని సీఎం జగన్ తెలిపారు. చేతిలో సెల్‌ఫోన్ ఉన్నా ప్రతీ ఒక్కరూ తనతోనే ఉన్నారని అందుకే తాను ఒంటరిని కాదని తెలిపారు. అయినా తాము విజయానికి చేరువగా ఉన్నామనే ప్రతిపక్షాలు..తమ పార్టీపై దాడిని తీవ్రతరం చేశాయని ఆరోపించారు. ఆనంతరం సీఎం జగన్ వైసీపీ సోషల్ మీడియాతో వారియర్స్‌తో సెల్ఫీ దిగారు.

Tags:    

Similar News