Tirupati: స్వచ్ఛత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘం పారిశుద్ధ్యం ఘన వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళలకు స్వచ్ఛత అవార్డులు ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ తెలిపారు...

Update: 2023-03-20 17:28 GMT

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు పురపాలక సంఘం పారిశుద్ధ్యం ఘన వ్యర్ధాల నిర్వహణలో ప్రతిభ చూపిన మహిళలకు స్వచ్ఛత అవార్డులు ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ తెలిపారు. వ్యక్తిగత, స్వయం సహాయక, చిన్న తరహా, సామాజిక మరుగుదొడ్ల నిర్వహణ, సెప్టిక్ ట్యాంకుల శుభ్రత, వ్యర్ధాల శుద్ధికరణ, చెత్త సేకరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించే పద్ధతులు, చెత్తతో కళాకృతుల తయారీ, చెత్తతో సంపద తయారీ, పొడి చెత్తను వినూత్న రీతిలో వినియోగించడం, స్వచ్ఛతపై అవగాహన కల్పించడం, తడి చెత్త వినియోగంతో కంపోస్టు తయారీ, మొదలగు విభాగాలలో అవార్డులు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈనెల 24లోగా గూడూరు పురపాలక కార్యాలయంలో నమోదు చేసుకోవాలని, ఎంపికైన వారికి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ తోట సాయినాథ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News