శ్రీవారి సేవలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి అంజరియా కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామం సమయంలో దర్శించుకున్నారు.

Update: 2024-05-01 07:58 GMT

దిశ,తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి అంజరియా కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామం సమయంలో దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయం మహా ద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి, న్యాయమూర్తులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.


Similar News