Tirumala: అందుబాటులోకి విద్యుత్ బస్సులు

తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల ఉచిత బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు నడపనున్నారు....

Update: 2023-03-26 15:16 GMT

దిశ, తిరుపతి: తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథాల ఉచిత బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు నడపనున్నారు. దీనికి సంబంధించి త్వరలో అధికారులు నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. ధర్మరథాల స్థానంలో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు ఒలెక్ర్టా కంపెనీ అధినేత 10 బస్సులు విరాళంగా ఇచ్చారు. సుమారు రూ.15 కోట్ల విలువైన 10 బస్సులు తిరుమలకు చేరుకున్నాయి. బస్సులను సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం ఒలెక్ర్టా కంపెనీ ప్రతినిధులు టీటీడీకి అందిచనున్నారు.  ఆ తర్వాత తిరుమల భక్తులకు ఉచిత సేవలు అందించనున్నాయి. 

Tags:    

Similar News