Tirumala: తిరుమలేశుడికి రూ. కోటి విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు

Update: 2023-03-05 11:38 GMT

దిశ, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదాని ట్రస్టుకు విరాళంగా రూ.కోటి అందజేశారు. హైదరాబాదుకు చెందిన సరోజినీ వడ్లమూడి అనే భక్తురాలు ఈ విరాళాన్ని అందజేశారు. ఆలయ అధికారులకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. అనంతరం ఆమెకు స్వామివారి దర్శనం కల్పించిన తరువాత ప్రసాదాలను అందజేశారు.

Tags:    

Similar News