Tirupati: జూన్ 10 నుంచి సీఐటీయూ రాష్ట్ర సమావేశాలు

జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సిఐటియు రాష్ట్ర సమావేశాలు తిరుపతిలో జరగనున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు..

Update: 2023-06-03 16:48 GMT

దిశ, తిరుపతి: జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సిఐటియు రాష్ట్ర సమావేశాలు తిరుపతిలో జరగనున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో ఏపీలోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని, రాష్ట్రంలో నెలకొన్న కార్మిక సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. సిఐటియు అఖిలభారత అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, అఖిలభారత నేతలు కరుమాలయన్, ఉమేష్ కుమార్ లతో బాటు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు, అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గఫూర్ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర సమావేశాల జయప్రదానికి తిరుపతి జిల్లా ప్రజానీకం సహకరించాలని కోరారు.

Tags:    

Similar News