Tirumala ఘాట్ రోడ్లో కారు ప్రమాదం.. అయ్యప్ప భక్తులకు గాయాలు
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలడంతో అదుపు తప్పి ఘాట్ రైలింగ్ను ఢీకొట్టింది..
దిశ వెబ్ డెస్క్: తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలడంతో అదుపు తప్పి ఘాట్ రైలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఆయ్యప్ప భక్తులకు గాయాలయ్యాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి తిరుమలకు వెళ్తుండగా ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.