Tirumala: తిరుమలలో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం..

దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం.Five years old boy was kidnapped by Woman in tirumala-latest telugu news

Update: 2022-05-02 09:29 GMT

Five years old boy was kidnapped by Woman in tirumala

దిశ, ఏపీ బ్యూరో : తిరుమల(tirumala) శ్రీవారి ఆలయం ఎదురుగా ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురవ్వడం కలకలం రేపుతోంది. కిడ్నాప్‌కు గురైన బాలుడు తిరుపతి(Tirupati) దామినీడుకు చెందిన గోవర్దన్‌‌గా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆదివారం ఉదయం శ్రీవారి ఆలయం ఎదురుగా కూర్చొని ఉండగా బాలుడిని ఓ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసింది. ఈ విషయాన్ని బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. బాలుడిని అపహరించిన మహిళ తిరుమలకు వచ్చి తిరుపతికి ఏపీ03 జెడ్‌ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News