IAS పరిస్థితే ఇలా ఉంటే ఎలా.. జగన్ సర్కారుపై చంద్రబాబు సంచలన ట్వీట్

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. ఆరోపణలు, ప్యత్యారోపణలతో ట్విట్టర్ హ్యాండిల్స్ హోరెత్తుతున్నాయి.

Update: 2024-05-06 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ టీడీపీ, వైసీపీ ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. ఆరోపణలు, ప్యత్యారోపణలతో ట్విట్టర్ హ్యాండిల్స్ హోరెత్తుతున్నాయి. ఇక, తాజాగా ఏపీలో ఓ ఐఏఎస్ అధికారి పరిస్థితిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు సంచలన ట్వీట్ చేశారు. జగన్ సీఎంవోలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ట్వీట్ స్క్రీన్ షాట్ ఫొటోను జత చేశారు. 

Similar News