నన్ను, Lokeshను చంపేస్తారట.. ChandraBabu Naidu సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరులో 'ఇదేం ఖర్మ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ తనను, లోకేశ్‌ను కూడా చంపేస్తారట...

Update: 2022-11-30 10:18 GMT

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెందులూరులో 'ఇదేం ఖర్మ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ తనను, లోకేశ్‌ను కూడా చంపేస్తారట అని చంద్రబాబు అన్నారు. వాళ్లు తల్చుకుంటే బాబాయ్‌ని  చంపినట్లు తమను కూడా చంపేస్తారట అని వ్యాఖ్యానించారు. జగన్‌కు పోలీసులుంటే తనకు ప్రజలు ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.  చివరి అవకాశం తనకు కాదని.. ప్రజలకు అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడైనా ప్రజలు కళ్లు తెరవాలని హితవు పలికారు. మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదని పేర్కొన్నారు. తనకేమీ కొత్త చరిత్ర అవసరంలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి : చంద్రబాబు, లోకేశ్‌లకు భద్రత పెంచండి

Tags:    

Similar News